హైదరాబాద్ లో పార్కులను అభివృద్ధి పరచే కార్యక్రమాలు యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నారు. పార్కుల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ నేడు నియోజకవర్గంలోని పార్కులను పరిశీలించారు.
సంబంధిత శాఖల అధికారులు కూడా ఎమ్మెల్యే వెంట ఉన్నారు. బాగ్ అంబర్ పేట్ డివిజన్ ఇంద్రప్రస్థ కాలనీలో పార్కుల్ని వారు నేడు పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మిర్యాల రవీందర్ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలోని పార్కులను పూర్తిగా అభివృద్ధి పరుస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటేశ్ అన్నారు.