తమ ఏజెన్సీ ద్వారా ఉద్యోగ విధులు నిర్వర్తిస్తూ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తికి ఈఎస్ఐ ఫారంతోపాటు రెండు నెలల వేతనాన్ని అడ్వాన్స్ గా అమ్మ ఏజెన్సీ వారు అందజేశారు.
ములుగు మండలం జంగాలపల్లి గ్రామానికి చెందిన తోకల కుమారస్వామి భూపాలపల్లి జిల్లాలోని బీసీ హాస్టల్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తున్నాడు.
కొద్ది రోజుల క్రితం విధులు ముగించుకొని ఇంటికి తిరిగి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న ములుగులోని అమ్మ ఏజెన్సీ ప్రతినిధులు యాసం రాజ్ కుమార్, తాడెం తిరుపతిలు కుమారస్వామి ఇంటికి వెళ్లి ట్రీట్ మెంట్ కు సంబంధించిన ఈఎస్ఐ ఫారంను అందజేశారు.
అదేవిధంగా నాలుగు నెలలుగా వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్న కుమారస్వామికి రెండు నెలల వేతనాన్ని సుమారు రూ.21వేలను అడ్వాన్స్ గా అందజేసినట్లు అమ్మ ఏజెన్సీ ప్రతినిధులు వెల్లడించారు.
కుమారస్వామి త్వరగా కోలుకోవాలని, అన్నివేళలా సహాయ సహకారాలు అందజేస్తామని వారు పేర్కొన్నారు.