ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని టిఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జి తాత మధు పిలుపునిచ్చారు.
బుధవారం ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలోని కొత్త లింగాల ఫంక్షన్ హాల్లో నిర్వహించిన పట్టభద్రుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు పలు రకాల అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని అదేవిధంగా ఎంతో కాలంగా ఉద్యోగులు ఎదురు చూస్తున్న పి ఆర్ సి ని ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం ప్రకటిస్తామని స్వయంగా సీఎం ప్రకటించారని వెల్లడించారు
అదేవిధంగా రాష్ట్రంలో ప్రభుత్వరంగ సంస్థల్లో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని నిరుద్యోగులకు సీఎం హామీ ఇచ్చారని ఇవి అమలు కావాలంటే రాజేశ్వర్ రెడ్డి ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఇల్లందు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భానోత్ హరి సింగ్, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు ఎ అచ్చయ్య,
ఎంపీపీ బానోత్ సునీత, డి సి సి బి డైరెక్టర్ మేకల మల్లి బాబు యాదవ్, టిఆర్ఎస్ ఇల్లందు నియోజకవర్గ నాయకులు ఎస్ రంగనాథ్, సిలివేరి సత్యనారాయణ, పత్తె అహ్మద్, కె విష్ణువర్ధన్ రెడ్డి, కామేపల్లి,కొండాయిగూడేంసొసైటీ చైర్మన్ లు చిదంబర రావు, హనుమంతరావు టిఆర్ఎస్ మండల నాయకులు ఎం శ్రీనివాస రావు, కృష్ణారెడ్డి, మోహన్ రెడ్డి పలువురు సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు గ్రాడ్యుయేట్స్ పాల్గొన్నారు.