39.2 C
Hyderabad
May 3, 2024 13: 04 PM
Slider నెల్లూరు

వేలకోట్లు సంపాదించిన నీలానే అందరూ ఉంటారా సజ్జలా?

#anamramanarayanareddy

సస్పెండ్ అయిన అనంతరం ఘాటు వ్యాఖ్యలు చేసిన వైసీపీ సీనియర్ ఎంఎల్ఏ ఆనం రామనారాయణ రెడ్డి

ఆ ప్రభుత్వం లో  అక్కడంతా ఏకఛత్రాధిపత్యమే.. వాళ్లకి భజనపరులే కావాలని నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎంఎల్ఏ ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. వైఎస్సారెస్పీ  నుంచీ సస్పెండ్ అయిన అనంతరం ఆయన మీడియా తో మాట్లాడుతూ గత నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నానని.. ఏనాడూ ప్రజాస్వామ్య విలువలు ఇంతలా దిగజారలేదని అన్నారు. అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు ఇలాంటి పరిస్థితి రావడం చాలా దారుణమని చెప్పారు. ఎంతో మంది పెద్ద నేతలతో పనిచేశానని.. ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదన్నారు.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడ్డారంటూ పార్టీ నుంచి వైఎస్సారెస్పీ  సస్పెండ్‌ చేసిన నేపథ్యంలో పరోక్షంగా అధికార పార్టీ పైన, సీఎం జగన్‌ పైన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపైన ఆయనీ వ్యాఖ్యలు చేశారు. సీఎంవో నుంచి ఫోన్లు వచ్చాయని..”ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచే ప్రశ్నిస్తూ వచ్చాను. ప్రశ్నించే గొంతుక అంటే ఏ రాజకీయ పార్టీ అయినా దాన్ని సద్విమర్శగా తీసుకుని మంచి చేసేందుకు ప్రయత్నం చేయాలి.

కానీ అధికారంలోని పార్టీ ప్రశ్నించే గొంతుకను తొక్కేయడం, నలిపివేయడం చేస్తోంది. రాష్ట్రంలో, మా జిల్లాలో జరిగే దోపిడీ వ్యవస్థలపై ప్రశ్నించాను.. విమర్శించాను. అభివృద్ధి నిలిచిపోయిందని.. అరాచకకాలు జరుగుతున్నాయని చెప్పాను. ప్రాజెక్టులు, ఇతర నిర్మాణాలు జరగడంలేదని గత నాలుగు నెలలుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాను. అందుకే నన్ను పక్కన పెట్టి నా నియోజకవర్గంలో రాజ్యాంగేతర శక్తిని ఇన్‌ఛార్జ్‌గా పెట్టారు. నాకు సహకరించవద్దని జిల్లా కలెక్టర్‌, ఎస్పీలకు సీఎంవో నుంచి కూడా ఫోన్లు వచ్చాయి. ఆఖరికి నా భద్రతను కూడా తగ్గించారు..ఎమ్మెల్సీ ఎన్నికలను అడ్డుపెట్టుకుని..

ప్రజాస్వామ్య విలువలు తెలియని వ్యక్తులతో నాలుగేళ్లు నడిచినందుకు బాధపడుతున్నాం. ఎమ్మెల్సీ ఎన్నికలను అడ్డుపెట్టుకుని ఈ విధంగా చేశారు. మీరేమైనా అనుకోండి.. మేం అనుకున్నదే చేస్తాం అన్నట్లుగా వారి వ్యవహారశైలి ఉందన్నారు…ఎంఎల్ఏ ఆనం రామనారాయణ రెడ్డి. అటువంటి సలహాదారుల సలహాలతో నడిచే ప్రభుత్వం మనుగడ భవిష్యత్తులో ప్రశ్నార్థకం అవుతుందని…ఆనం అన్నారు.

ప్రభుత్వ సలహాదారు వేలకోట్లు ఎలా సంపాదించారో మేం చూశామని ఆరోపించారు. ఆయనలాగే అందరూ ఉంటారని అనుకుంటున్నారని అన్నారు. రాజకీయ జీవితంలో ఇలాంటి నిందలు, ఆరోపణలు సహజం. మా గురించి తెలిసిన వారు వాటిని విశ్వసించరని స్పష్టం చేశారు. ఇలాంటి చిల్లర వ్యవహారాలకు మేం పాల్పడ్డామని భావిస్తే అది వాళ్ల ఖర్మేనని ఆనం రామ్ నారాయణ రెడ్డి అన్నారు.

Related posts

నకిలీ డాక్టర్ గుట్టురట్టు

Bhavani

మహాశివరాత్రి ప్రత్యేకం…… శివయ్యకు అభిషేకం ఎందుకు చేయాలో తెలుసా…?

Satyam NEWS

సాధారణ చార్జీలతోనే సంక్రాంతి బస్సులు

Bhavani

Leave a Comment