గుంటూరు జిల్లా నరసరావుపేట మున్సిపల్ కమిషనర్ కార్యాలయాన్ని అంగన్ వాడీ కార్మికులు ముట్టడించారు. అంగన్ వాడీల వ్యవస్థ ను నిర్వీర్యం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని వారు ఆందోళన వ్యక్తం చేస్తూ వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వం ఎక్కడ తమను తీసేస్తుందోననే ఆందోళనలో తాము ఉంటే కమిషనర్ తమను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తంచేశారు. తక్షణమే కమీషనర్ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
previous post