29.7 C
Hyderabad
May 2, 2024 04: 17 AM
Slider తూర్పుగోదావరి

నాలుగు లక్షల రూపాయలకు పైగా ధర పలికిన బంగారు చేప…

#bigfish

నిజంగానే ఇది బంగారు చేప…. దాని ధర రూ.4.30 లక్షలు. నిజమనిపించకపోయినా ఇది నిజం. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ మత్స్యకారుల వలకు ఓ అరుదైన చేప చిక్కింది. కచ్చిడి మగ చేప అయిన దీని బరువు 30 కిలోలకు పైగానే ఉంది. కచ్చిడి మగ చేప కడుపులో బ్లాడర్ ఉంటుందట. ఆ బ్లాడర్ కు మంచి గిరాకీ ఉంటుందట. ఇంకే కాకినాడ జాలర్లు ఈ చేప  చిక్కడంతో ఎగిరి గంతులేశారు. కచ్చిడి మగ చేప దొరికిందని తెలియడంతో ఆ చేపను కొనేందుకు వ్యాపారులు ఆసక్తి చూపారు. చివరకు ఈ చేప ఏకంగా రూ.4.30 లక్షలకు అమ్ముడుపోయింది. కాకినాడతో ఈ చేప ఇంత ధర పలకడం ఇదే తొలిసారని అక్కడి మత్స్యకారులు చెప్పారు. భారీ ధరకు ఆ చేప అమ్ముడుపోయినందుకు ఆనందం వ్యక్తం చేశారు.

Related posts

లంపి వైరస్ తో మృతిచెందిన పశు యజమానులకు పరిహారం

Satyam NEWS

నిన్న అడిగిన సంబంధంలేని ప్ర‌శ్న‌లు మ‌ళ్లీ అడిగారు

Satyam NEWS

పెండింగ్ ఉన్న మధ్యాహ్న భోజన కార్మికుల బిల్లులను చెల్లించాలి

Satyam NEWS

Leave a Comment