నిజంగానే ఇది బంగారు చేప…. దాని ధర రూ.4.30 లక్షలు. నిజమనిపించకపోయినా ఇది నిజం. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ మత్స్యకారుల వలకు ఓ అరుదైన చేప చిక్కింది. కచ్చిడి మగ చేప అయిన దీని బరువు 30 కిలోలకు పైగానే ఉంది. కచ్చిడి మగ చేప కడుపులో బ్లాడర్ ఉంటుందట. ఆ బ్లాడర్ కు మంచి గిరాకీ ఉంటుందట. ఇంకే కాకినాడ జాలర్లు ఈ చేప చిక్కడంతో ఎగిరి గంతులేశారు. కచ్చిడి మగ చేప దొరికిందని తెలియడంతో ఆ చేపను కొనేందుకు వ్యాపారులు ఆసక్తి చూపారు. చివరకు ఈ చేప ఏకంగా రూ.4.30 లక్షలకు అమ్ముడుపోయింది. కాకినాడతో ఈ చేప ఇంత ధర పలకడం ఇదే తొలిసారని అక్కడి మత్స్యకారులు చెప్పారు. భారీ ధరకు ఆ చేప అమ్ముడుపోయినందుకు ఆనందం వ్యక్తం చేశారు.
previous post