అంబర్పేట్ నియోజకవర్గం గోల్నాక డివిజన్ అభివృద్ధి తమ ధ్యేయమని కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కార్పొరేటర్ మాట్లాడుతూ రెండు సంవత్సరాలలో గోల్నాక డివిజన్ చాలా అభివృద్ధి జరిగిందని రాబోయే మూడు సంవత్సరాలలో పూర్తి అభివృద్ధి చేసి ప్రజలకు అండగా ఉంటామని ఆమె తెలిపారు.
పేద ప్రజలు ఇల్లు కడుతుంటే కొంతమంది నాయకులు తమ పేరు చెప్పి అక్రమ వసూళ్లకు పాల్పడితే ప్రజలు నేరుగా వారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని తమ దృష్టికి తీసుకురావాలని ఆమె తెలిపారు. ప్రభుత్వ భూములలో అక్రమ కట్టడాలు కడితే సహించేది లేదని ఆమె తెలిపారు.
సత్యం న్యూస్, అంబర్పేట