ములుగు జిల్లా కేంద్రంగా గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలనే డిమాండ్ తో మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ములుగు జిల్లా వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేయడమే లక్ష్యంగా గిరిజన యూనివర్సిటీ సాధన సమితి (JAC)ని ఎన్నుకోవడం జరిగింది. MRPS తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి బుర్రి సతీష్ మాదిగ ని ములుగు జిల్లా గిరిజన యూనివర్సిటీ సాధన సమితి JAC వైస్ చైర్మన్ గా ఎన్నుకున్నారు.
ఈ ఎన్నికకు సహకరించిన ములుగు జిల్లా ప్రజా సంఘాల నాయకులకు విద్యార్థి సంఘాల నాయకులకు వివిధ రాజకీయ పార్టీల నాయకులకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.