38.2 C
Hyderabad
May 3, 2024 19: 05 PM
Slider ముఖ్యంశాలు

టీడీపీ ఇక ప్యాకప్: ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని

#tammineni

రాష్ట్రంలో ఇక టీడీపీ మూటముళ్లు సర్దుకోవలసిందేనని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. విజయనగరం జిల్లా కు వచ్చిన ఆయన రామతీర్థం వెళ్లారు. అక్కడ దేవస్థానం ఈఓ అధికార లాంఛనాలతో స్పీకర్ కు స్వాగతం పలికారు. మీడియా తో మాట్లాడుతూ పొట్టలో కత్తులు పెట్టుకుని పొత్తులకు సిద్దమవుతున్నారు… అవన్నీ పొలిటికల్ ఫిలాసఫీ లేని పార్టీలని స్పీకర్ ఎద్దేవా చేశారు. పొలిటికల్ ఫిలాసఫీ తో సీఎం జగన్ ఉన్నారని… అందుకే సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తు.. రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో నడుపిస్తున్నారన్నారు.

గతంలో జన్మ భూమి కమిటీలు ఇచ్చినదే ఫైనల్ లిస్ట్ అని స్పీకర్ తమ్మినేని విమర్శించారు. ఇప్పుడు అ పరిస్థితి లేదు… పూర్తి పారదర్శకంగా అర్హులను గుర్తించి ఇవ్వడం జరుగుతుందన్నారు. గ్రామంలో పరిపాలన ఉండాలనే, సీఎం జగన్ పాలనను డీసెంట్రలైజ్ చేశారన్నారు. ఎందరు కలిసిన సీఎం జగన్ ని ఎదుర్కొలేదని స్పీకర్ స్పష్టం చేశారు. గడపగడపకు మన ప్రభుత్వంలో అందరూ పాల్గొంటున్నారు… ప్రజల మద్దతు లభిస్తొందని స్పీకర్ అన్నారు.

పాలసీ లేకుండా .. విధానం లేకుండా పొత్తులు పెట్టుకుంటే పొట్టలో కత్తులు పెట్టున్నట్టేనని రాష్ట్రంలో ని రాజకీయ పరిస్థితి పై స్పీకర్ వ్యాఖ్యానించారు. ప్రశ్నా పత్రాల లీకేజీని చంద్రబాబు, అశోక్ వాళ్ల నాయకులూ సమర్ధిస్తారా అని అడుగుతున్నానని స్పీకర్ ప్రశ్నలు సంధించారు.

మాల్ ప్రాక్టీసును మీరు సమర్ధిస్తున్నారా… సూటిగా చెప్పండి అంటూ మీడియా ను స్పీకర్ ప్రశ్నించారు. చట్టం తన పని తను చేస్తుంది… విచారాణ జరిపి చర్యలు తీసుకుంటారని స్పీకర్ తమ్మినేని స్పష్టం చేశారు. రాజకీయ మధ్యవర్తి లేకుండానే పథకాలన్నీ లబ్ధిదారులకు చేరుతున్నాయని అన్నారు. తమ సీఎం పాలనలో మిడిల్ మ్యాన్ వ్యవస్థకు తావు లేదని స్పీకర్ స్పష్టం చేశారు.

పవిత్ర మైన వ్యవస్థలను ఏర్పాచేసారని చెప్పారు. వాలంటీర్లు నేరుగా లబ్ధిదారులు అన్ని సంక్షేమ పథకాలు అందిస్తున్నారని స్పీకర్ కొనియాడారు. ప్రతిపక్షాలు ప్రజలలో కన్ఫ్యూజన్ చేయడానికి సర్కస్ ఫీట్స్ చేస్తున్నాయన్నారు.

Related posts

నిరాశ నిస్పృహ‌ లలో కొట్టుమిట్టాడుతున్న సీఎం కేసీఆర్

Satyam NEWS

ప్రతి పేదవాడికి నాణ్యమైన ఉచిత విద్య

Murali Krishna

గిరిజనులకు అండగా ప్రభుత్వం

Bhavani

Leave a Comment