38.2 C
Hyderabad
April 27, 2024 16: 58 PM
Slider కృష్ణ

పారాసిటమాల్, బ్లీచింగ్ పౌడర్ భ్రమ వదలండి

kesineni nani

కరోనా వైరస్ ను నియంత్రించడంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, పారాసిటమల్, బ్లీచింగ్ పౌడర్ వాడితే చాలు అనే మొద్దు నిద్ర నుండి బయటికి రావాలని ఎంపీ కేశినేని నాని అన్నారు. పేద, మధ్య తరగతి వారిని తక్షణమే ఆదుకోవడానికి వారి బ్యాంక్ ఖాతాలలో 5000 రూపాయలను జమ చేయాలని నాని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

విజయవాడలోని ఎనికేపాడులో కోనేరు పెదబాబు ఆధ్వర్యంలో లక్ష కోడి గుడ్లను ఇంటి ఇంటికి పంపిణీ చేసే కార్యక్రమాన్ని నేడు ఆయన ప్రారంభించారు. కరోనా ని కూడా వైసీపీ నాయకులు రాజకీయం చేస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 1000 రూపాయల సహాయాన్ని వైసీపీ సాయంగా ప్రచారం చేస్తున్నారని, దీనిపై ఎన్నికల కమిషనర్ కి ఫిర్యాదు చేశామని నాని చెప్పారు.

తెలుగుదేశం – సేవ ఎప్పుడూ కలిసే ఉంటాయని, ప్రతి ఒక్కరూ పేద వారిని ఆదుకోవడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. భవన నిర్మాణ కార్మికులు, రవాణా రంగంలోని వారు, డ్రైవర్లు, అసంఘటిత రంగంల్లో ఉన్న ప్రతి ఒక్కరూ చాలా ఇబ్బందులకు గురవుతున్నారని ఈ పరిస్థితుల నుండి రాష్ట్రం త్వరగా బయట పడాలని కోరుకుంటున్నామని అన్నారు.

Related posts

మానవాళిని కాపాడుకోవడానికే గ్రీన్ ఛాలెంజ్

Satyam NEWS

ఢిల్లీ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రికి కరోనా లక్షణాలు

Satyam NEWS

MRPS నియోజకవర్గ ఇన్ చార్జిగా వస్కుల జయరాజు

Satyam NEWS

Leave a Comment