38.2 C
Hyderabad
April 29, 2024 13: 15 PM
Slider నల్గొండ

MRPS నియోజకవర్గ ఇన్ చార్జిగా వస్కుల జయరాజు

#MRPS

MRPS రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర కార్యదర్శి రావూరి విజయభాస్కర్ మాదిగ ఆధ్వర్యంలో MRPS ముఖ్య కార్యకర్తల సమావేశం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో శనివారం జరిగింది.

ఈ సమావేశంలో నియోజకవర్గ ఇన్చార్జిగా వస్కుకుల జయరాజు ను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సమావేశంలో జిల్లా MRPS అధ్యక్షుడు మరికంటి అంబేద్కర్ మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్ర ఏర్పాటై 7 సంవత్సరాలు గడిచినా మాదిగల బ్రతుకులు మారలేదని, అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల సమయంలో ఓట్ల కోసం తప్ప మాదిగల ఎదుగుదల పట్టించుకోవడం లేదన్నారు.

సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును టిఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే బెంచ్ ఏర్పాటు చేసి వర్గీకరణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో MRPS జాతీయ ప్రధాన కార్యదర్శి చింతా బాబు మాదిగ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కలకొండ ఆదినారాయణ పాల్గొన్నారు.

ఇంకా, రాష్ట్ర కార్యదర్శి పల్లేటి లక్ష్మణ్ మాదిగ, కడప పెంటయ్య, గుండెపంగు పద్మ, కృష్ణ బాబు, బచ్చలకూరి నాగరాజు, జానయ్య, పిడపర్తి వెంకటనారాయణ, సైదులు,ప్రసాదు,ఉపేందర్, లింగయ్య,సైదులు,సత్తి,శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Related posts

గర్భిణీ స్త్రీలపై అంగన్వాడీ టీచర్లు తీసుకుంటున్న శ్రద్ధ తల్లి ప్రేమను తలపిస్తుంది

Satyam NEWS

మంగాపురం కాలనీలో వెంకటేశ్వర స్వామి కళ్యాణమహోత్సవం

Satyam NEWS

డ్రగ్ రాకెట్: మైలవరంలో గంజాయి కలకలం

Satyam NEWS

Leave a Comment