విజయనగర ఉత్సవాల ఏర్పాట్లలో కనిపించిన దృశ్యం…. గుర్తింంచిన సత్యం న్యూస్.నెట్
దేశానికి రాష్ట్రపతి ఎలాంటి వారో…జిల్లాకు కలెక్టర్ అంతటి వారు. పాలించే పాలకులది శాసనాలు తయారు చేసినా…దాన్ని క్షేత్ర స్తాయిలోఅమలు పరిచేది…కలెక్టరే..అంటే కార్య నిర్వహణాధికారి.ఆ కలెక్టరే.. ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కూడా.అలాంటి కలెక్టర్….జిల్లా స్థాయిలోజిల్లా రెవిన్యూ అధికారి లేనిదో ముందుకెళ్లలేరా..? లేక…తనతో పాటు డీఆర్ఓకు కూడా సముచిత స్థానం ఉంటుందని…ఉండాలని…అది ప్రజలకు మరీ ముఖ్యంగా పత్రికా రంగానికి తెలియాలా..?
ఈ ప్రశ్నలన్నీ వార్తావళి ఎందుకు వేస్తోందంటే… ఈ నెల 09,10 తేదీలలో జిల్లా కేంద్రంలో విజయనగరం ఉత్సవాలను నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేస్తోంది.అందకు కోసం నగరంలో అయోద్యా మైదానం,కోట,గురజాడ కళాక్షేత్రం..సంగీత కళాశాల స్థలాలను జిల్లా కలెక్టర్ సూర్యకుమారీ సంబంధిత జిల్లా అధికారులతో పరిశీలించారు.
అందులో భాగంగా కోట ప్రదేశాన్ని పరిశీలించే సమయానికి అక్కడే విలేకరులతో జిల్లా కలెక్టర్ మాట్లాడేందుకు సిద్దమయ్యారు.కానీ ఆ సమయంలో అంత వరకు తనతో ఉన్న జిల్లా రెవిన్యూ అధికారి గణపతిరావు అక్కడ లేకపోవడంతో.. వెంటనే విలేకరులతో మాట్లాడుతుండగానే…పక్కనే ఉన్న అల్లంత దూరంలో ఉన్న డీఆర్ఓ ను..ఎడమ చెయ్యి చూపించి…తన వద్దకు..విలేకరుల వద్ద కు రావాలని జిల్లా కలెక్టర్ పిలడం…కెమార కంట పడింది.
అంతలోనే జిల్లా కలెక్టర్…ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ తనను పలివడంతో ఒక్కసాకి ఖంగుతిన్న డీఆర్ఓ..క్షణం ఆగకుండా కలెక్టర్ పిలిచానడంతో..కెమారాకు అడ్డు వచి మరీ.కలెక్టర్ వెంటే ఉండటం అదీ ముఖంలో ఎంతో ఆనందం వెల్లివిరయడం కెమరా కంట చిక్కింది.ఏదైనా…ఒక్కటి విజయనగరం ఉత్సవాలు.. రెండు…తనకంటే…స్థానికంగాఉండే జిల్లా రెవిన్యూ అధికారి సర్వంతెలిసి ఉంటుందన్న భావనతో….విలేకరుల వద్ద కు అదీ విలేకరులతో తాను మాట్లాడుతుండగా డీఆర్ఓ ను కూడ పిలవడం..విజయనగరం ఉత్సవ నిర్వహణను మరింతక పకడ్బందీగా నిర్వహించాలన్న కలెక్టర్ ఆలోచనకు సత్యం న్యూస్.నెట్ హేట్సాప్ చెబుతోంది.