రాయచోటి రూరల్ సర్కిల్, సుండుపల్లి పి. ఎస్ పరిధిలోని కొరివివాండ్ల పల్లి గ్రామంలో పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు.
ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న 17 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుండి రూ.1,11,390 నగదు, 3 బైక్ లు స్వాధీనం చేసుకున్నారు.
నిందితులను అరెస్టు చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రాయచోటి రూరల్ సి.ఐ. లింగప్ప, వీరబల్లి ఎస్.ఐ మహమ్మద్ రఫీ మీడియాకు వివరించారు.