తెల్ల దోమ తెగులు పామాయిల్ రైతుల పాలిట శాపంగా మారిందని ఏలూరు జిల్లా లో పలు మండలాల ఆయిల్ పామ్ రైతులు ఆవేదన చెందుతున్నారు. ఆయిల్ పామ్ పంట పై తెల్ల దోమ చేరి రసాన్ని చప్పరించేస్తుంది. దీంతో రైతులు ఆయిల్ పామ్ లో దిగుబడులు గణనీయంగా తగ్గి ఆర్థికంగా ఆటలాకుతలమౌతున్నారు. ఒక్కో మొక్కకు అరడజను గెలల దిగుబడి కి గాను తెల్ల దోమ ఆశించిన తరువాత రెండు లేక మూడు గెలల దిగుబడి కి తగ్గిందని రైతులు దిగులు చెందుతున్నారు.
ప్రభుత్వం ఆయిల్ పామ్ పంటకు సరైన గిట్టుబాటు ధర కల్పించిన 2022 లో టన్ను ఆయిల్ పామ్ గెలల ధర 24000 నుండి 28000 వరకు ఉండేది. 2023 లో టన్ను గెలల ధర కేవలం 13000 వేల రూపాయలు పడిపోయింది దీంతో రైతులు పంటను తెల్ల దోమ పంటను కబళిలిస్తుందని బాధపడాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పామాయిల్ ధర పై నోరు మెదప నందుకు రైతు దిగులు పడాలో తెలియక సత మతమౌతు న్నామని తెలుపుతున్నారు.
సబ్సిడీలపై మొక్కలను, ఎరువులు అందించారు. ఈ పంటకు బిందు సేద్యం సులభమని డ్రిప్ పైపులు కూడా సబ్సిడీ పై సరఫరా చేసి జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని ఖూనీ చేస్తున్నారని ఆయిల్ పామ్ రైతు నేడు కంట తడి పెట్టుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా చమురు ధరలు సామాన్యులకందకుండా ఆకాశాన్ని అంటుతున్నాయి.2025 నుండి 2030 నాటికి ఆయిల్ పామ్ సాగు ఆప్ లాండ్ భూముల్లో దేశం లోని అత్యధిక విస్తీర్ణం లో సాగుచేయడానికి జాతీయ స్థాయిలో ఆయిల్ పామ్ శాస్త్ర వేత్తలు రైతుల తో సెమినార్లు కూడా నిర్వహించినట్టు సమాచారం.
అటువంటి సెమినార్లు ఆరంభ సూరత్వంగా మిగిలిపోయి నేడు ఆయిల్ పామ్ రైతులకు గిట్టుబాటు ధర లేకుండా చేసి పంట ఉంచాలా తొలగించాలా అనే నిరాశా నిస్పృహలతో రైతు కొట్టు మిట్టాడుతున్న పరిస్థితి ఏర్పడిందని రైతులు తెలుపుతున్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి పామాయిల్ గెలల టన్నేజి ధర పెంచి రైతులను ఆదుకోవాలని ఆప్ లాండ్ రైతులు కోరుతున్నారు.
తెల్ల దోమ తెగులు పామాయిల్ రైతుల పాలిట శాపంగా మారిందని ఏలూరు జిల్లా లో పలు మండలాల ఆయిల్ పామ్ రైతులు ఆవేదన చెందుతున్నారు. ఆయిల్ పామ్ పంట పై తెల్ల దోమ చేరి రసాన్ని చప్పరించేస్తుంది. దీంతో రైతులు ఆయిల్ పామ్ లో దిగుబడులు గణనీయంగా తగ్గి ఆర్థికంగా ఆటలాకుతలమౌతున్నారు. ఒక్కో మొక్కకు అరడజను గెలల దిగుబడి కి గాను తెల్ల దోమ ఆశించిన తరువాత రెండు లేక మూడు గెలల దిగుబడి కి తగ్గిందని రైతులు దిగులు చెందుతున్నారు. ప్రభుత్వం ఆయిల్ పామ్ పంటకు సరైన గిట్టుబాటు ధర కల్పించిన 2022 లో టన్ను ఆయిల్ పామ్ గెలల ధర 24000 నుండి 28000 వరకు ఉండేది.
2023 లో టన్ను గెలల ధర కేవలం 13000 వేల రూపాయలు పడిపోయింది దీంతో రైతులు పంటను తెల్ల దోమ పంటను కబళిలిస్తుందని బాధపడాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పామాయిల్ ధర పై నోరు మెదప నందుకు రైతు దిగులు పడాలో తెలియక సత మతమౌతు న్నామని తెలుపుతున్నారు. సబ్సిడీలపై మొక్కలను, ఎరువులు అందించారు. ఈ పంటకు బిందు సేద్యం సులభమని డ్రిప్ పైపులు కూడా సబ్సిడీ పై సరఫరా చేసి జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని ఖూనీ చేస్తున్నారని ఆయిల్ పామ్ రైతు నేడు కంట తడి పెట్టుకుంటున్నారు.
దేశ వ్యాప్తంగా చమురు ధరలు సామాన్యులకందకుండా ఆకాశాన్ని అంటుతున్నాయి.2025 నుండి 2030 నాటికి ఆయిల్ పామ్ సాగు ఆప్ లాండ్ భూముల్లో దేశం లోని అత్యధిక విస్తీర్ణం లో సాగుచేయడానికి జాతీయ స్థాయిలో ఆయిల్ పామ్ శాస్త్ర వేత్తలు రైతుల తో సెమినార్లు కూడా నిర్వహించినట్టు సమాచారం. అటువంటి సెమినార్లు ఆరంభ సూరత్వంగా మిగిలిపోయి నేడు ఆయిల్ పామ్ రైతులకు గిట్టుబాటు ధర లేకుండా చేసి పంట ఉంచాలా తొలగించాలా అనే నిరాశా నిస్పృహలతో రైతు కొట్టు మిట్టాడుతున్న పరిస్థితి ఏర్పడిందని రైతులు తెలుపుతున్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి పామాయిల్ గెలల టన్నేజి ధర పెంచి రైతులను ఆదుకోవాలని ఆప్ లాండ్ రైతులు కోరుతున్నారు.