29.7 C
Hyderabad
May 1, 2024 06: 56 AM
Slider ముఖ్యంశాలు

అంబేద్కర్ విగ్రహాన్ని అవమానించినవారిని ఉరితీయాలి

#MaalaMahanadu

అంబేద్కర్ విగ్రహాన్ని అవమానపరిచిన దుర్మార్గులను బహిరంగంగా ఉరి తీయాలని మాలల చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మూలె కేశవులు డిమాండ్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నగర పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి కొందరు అగంతకులు చెప్పుల దండ వేసిన విషయం తెలిసిందే.

వారిని వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అంబేద్కర్ ను అవమానించడం అంటే భారత రాజ్యాంగాన్ని అవమానించడమేనని ఆయన అన్నారు.

ఇలాంటి దుర్మార్గులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.

 లేకపోతే రెండు తెలుగు రాష్ట్రాల అంబేద్కర్ వారసుల ఆగ్రహానికి గురికాక తప్పదని మాలల చైతన్య సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దెల రామదాసు పత్తి యాదయ్య హౌ టు ఎర్ర శీను తదితరులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Related posts

స్పందన లేని ప్రత్యామ్నాయం: నిరుత్సాహంలో కేసీఆర్

Satyam NEWS

ఎన్నికల వేళ ఇంటింటికీ ఇస్తానన్న బియ్యం ఏది?

Satyam NEWS

స్వీయ జాగ్రత్తలు పాటిస్తూ, మనో ధైర్యంగా ఉండాలి

Satyam NEWS

Leave a Comment