రాజకీయ కక్ష సాధింపుతో టిడిపి పార్టీ నాయకులు ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి వాసులను అరెస్టు చెయ్యడం దుర్మార్గం అని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి టి.అరుణ్ అన్నారు. మంగళవారం స్థానిక వి.ఎల్.పురం రోడ్ లో ఆదిరెడ్డి స్వగృహంకు సిపిఎం జిల్లా బృందం వెళ్లి ఆదిరెడ్డి కుటుంబానికి ధైర్యం చెప్పారు.
ఎన్నికలు సమిపిస్తున్న సమయంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకులపై కేసులు, అరెస్టులకు పాల్పడటం సరికాదని అన్నారు. చిట్ ఫండ్అక్రమాలు ఉంటే విచారించాలని, విచారణ లేకుండా అరెస్టులు చెయ్యడం కక్ష సాధింపు చర్యగా ఉన్నదని అన్నారు. రాజమహేంద్రవరం నగర శాసన సభ్యురాలు ఆదిరెడ్డి భవాని సోదరుడు టిడిపి ఎం.పి రామ్ మోహన్ నాయడు కింజరపు ,ఆదిరెడ్డి కుటుంభ సభ్యులను కలిసి ధైర్యం చెప్పి వచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి బి.పవన్, పార్టీ నాయకులు ఎస్.ఎస్.మూర్తి,బి.రాజులోవ,టి.తులసి, ఐ.సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.