ఏపి డీజీపీగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి నమ్మిన బంటుగా పని చేసిన గౌతమ్ సవాంగ్ బీజేపీలో చేరుతున్నారా? అకస్మాత్తుగా ఆయన ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ తో సమావేశం కావడం చర్చకు దారితీసింది. డీజీపీగా పని చేసిన గౌతమ్ సవాంగ్ ను ముఖ్యమంత్రి జగన్ అకస్మాత్తుగా ఆ పదవి నుంచి తప్పించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయనను రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా నియమించారు.
అప్పటి నుంచి గౌతమ్ సవాంగ్ పెద్దగా వార్తలలోకి ఎక్కలేదు. అకస్మాత్తుగా ఆయన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిని కలవడంతో కొత్త చర్చకు తెరతీసినట్లయింది. ఈ నెల 22,23 తేదీ లలో యూపీ రాష్ట్ర రాజధాని లక్నో రాష్ట్ర పోలీస్ హెడ్-క్వార్టర్స్ లో జరుగుతున్న 24వ జాతీయ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్ పర్సన్ ల సదస్సుకు ఆయన హాజరయ్యారు. ఈ కాన్ఫరెన్స్ కి ముఖ్య అతిథిగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం యోగి ఆదిత్యనాథ్ ఏర్పాటు చేసిన విందులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం యోగితో ఆయన ఏకాంతంగా సమావేశమయ్యారు.