32.2 C
Hyderabad
May 2, 2024 01: 49 AM
Slider ప్రత్యేకం

బంగాళాఖాతంలో ‘అసని’ తీవ్రతుపాను

#asanicyclone

బంగాళాఖాతంలో అసని తుఫాను మరో 12 గంటల పాటు బీభత్సం సృష్ఠిస్తుందని ఏపీ విపత్తుల నివారణ సంస్థ పేర్కొంది.గడిచిన 6 గంటల్లో గంటకు 25 కి.మీ వేగంతో పశ్చిమవాయువ్య దిశగా కదులుతుంది.ప్రస్తుతం కాకినాడకు 210 కి.మీ., విశాఖపట్నంకు 310 కి.మీ., గోపాలపూర్ కు 530 కి.మీ., పూరీకు 630 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది.

ఇది వాయువ్య దిశగా పయనించి రేపు ఉదయంకు కాకినాడ -విశాఖపట్నం తీరాలకు దగ్గరగా చేరుకునే అవకాశం ఉందని సంస్థ తెలిపింది.అయితే దిశ మార్చుకుని ఉత్తర-ఈశాన్య దిశగా కదులుతూ ఉత్తరాంధ్ర మరియు ఒడిశా తీరాలకు దూరంగా వాయువ్య బంగాళాఖాతంలోకి వెళ్ళే అవకాశం ఉందని సంస్థ తెలిపింది.

తదుపరి 12గంటల్లో క్రమంగా తీవ్రతుపాను నుంచి తుపానుగా బలహీనపడే అవకాశం ఉందని విపత్తుల నివారణ సంస్థ పేర్కొంది. ఈ రోజురాత్రి నుంచి ఉమ్మడి కోస్తాంధ్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతిభారీవర్షాలు పడే అవకాశం ఉంది.

రేపు ఉత్తరాంధ్రలో వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతిభారీవర్షాలు, ఒకటి రెండు చోట్ల అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 75-95 కిలోమీటర్ల వేగంతో ఈదురగాలులు వీస్తాయి. .సహాయక చర్యలకు ఎస్ డీ ఆర్ ఎఫ్ ,ఎన్ డీఆర్ ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి.

తుపాను నేపధ్యంలో కోస్తాంధ్ర జిల్లా యాత్రాంగాలని అప్రమత్తం చేసింది విపత్తుల సంస్థ.సముద్రం అలజడిగా ఉండటంతో గురువారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని రాష్ట్ర విపత్తుల సంస్థ డైరెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్ తెలిపారు.

Related posts

ఖమ్మం జిల్లాలో పోటెత్తుతున్న వరద నీరు

Satyam NEWS

విజయనగరం జిల్లాలో స్పెషల్ డ్రైవ్: సారా అక్రమ రవాణాపై 60 కేసులు

Satyam NEWS

పదిమంది ప్రాణాలు కాపాడినందుకు సీఎంకు రుణపడి ఉంటాం..!

Satyam NEWS

Leave a Comment