40.2 C
Hyderabad
April 29, 2024 18: 26 PM
Slider ప్రత్యేకం

మినీ మహానాడు కు విజయనగరం జిల్లా టీడీపీ సన్నద్ధం

#ashokgajapatiraju

విజయనగరంలో కేంద్ర మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు అశోక్ గజపతిరాజు అశోక్ బంగ్లాలో ఆ పార్టీ పార్లమెంట్ సమావేశం జరిగింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున అధ్యక్షత న జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఈ సమావేశంలో పొలిట్ బ్యూరో సభ్యులు అశోక్ గజపతి రాజు, కిమిడి కళా వెంకటరావు నియోజకవర్గ ఇంచార్జ్ లు పతివాడ నారాయణస్వామి నాయుడు, కొండ్రు మురళీమోహన్ , డా. కొండపల్లి అప్పలనాయుడు , అదితి గజపతి రాజు పాల్గొన్నారు. కాగా తెలుగు దేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతం అయ్యేలా నియోజకవర్గాలలో షెడ్యూలు వేసుకుని వంద శాతం సభ్యత్వం నమోదు జరిగేలా ప్రణాళిక రూపొందించుకోవాలని నిర్ణయించారు.

ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా పార్టీ ఆదేశాల ప్రకారం అన్ని గ్రామాలలో బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని నిర్ణయించడం జరిగింది. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ మరియు మండల స్థాయిలలో ఉన్న పార్టీ అనుబంధ కమిటీలను త్వరిగతిన పూర్తి చేయాలని నిర్ణయించారు పార్టీ పెద్దలు.

అలాగే నియోజకవర్గ ఇంచార్జ్ లతో ప్రతి నెల మొదటి సోమవారం నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది.
మహానాడు కు ముందుగా నియోజకవర్గాలలో జరిగే మినీ మహానాడులో ఆయా నియోజకవర్గాలలో ఉన్న ప్రజా సమస్యలను చర్చించి, తీర్మానించి పార్టీ కార్యాలయానికి పంపుట గూర్చి చర్చించారు.

Related posts

దటీజ్ మోడీ: అరుణ్ శౌరీని పరామర్శించిన ప్రధాని

Satyam NEWS

కృష్ణా పరివాహక తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Satyam NEWS

అమ్మా మల్లు స్వరాజ్యం నీ ఆశయాలను వమ్ము కానివ్వం

Satyam NEWS

Leave a Comment