29.7 C
Hyderabad
May 2, 2024 05: 07 AM
Slider జాతీయం

The End: రాజస్థాన్ ముఖ్యమంత్రి గెహ్లాట్ కేల్ ఖతం

#ashokgehlot

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ రాజకీయ శకం ముగిసినట్లే కనిపిస్తున్నది. ఏఐసిసి అధ్యక్షుడు అవుతాడనుకున్న తరణంలో ఆయన చేసిన రాజకీయం అటూ ఇటూ కాకుండా చేసేసింది. ఆయన సోనియా గాంధీతో నేడు జరిపిన భేటీ ముగిసింది. సమావేశం అనంతరం తాను కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేయబోనని ప్రకటించారు. తాను ముఖ్యమంత్రిగా కొనసాగుతానో లేదో తెలియదన్నారు.

గత రోజు ఏం జరిగినా తాను సోనియాకు క్షమాపణలు చెబుతున్నానని చెప్పారు. గత 50 ఏళ్లలో ఇందిరాగాంధీ, రాజీవ్‌జీల తర్వాత సోనియాజీ కాలం నుంచి నమ్మకమైన సైనికుడిగా పనిచేశానన్నారు. సోనియా ఆశీస్సులతో మూడోసారి ముఖ్యమంత్రి అయ్యానని ఆయన చెప్పారు. ఇదిలావుండగా రెండు రోజుల క్రితం జరిగిన ఘటన అందరినీ కలచివేసింది. నేను కూడా సోనియా జీకి సారీ చెప్పాను. ఎందుకంటే క్లారిటీ లేకుండా పోయింది. అది ఎన్నికలైనా, ముఖ్యమంత్రి నిర్ణయం అయినా అని ఆయన నిరాశగా తెలిపారు.

Related posts

హానర్: జూన్ 2న జెండా ఎగరేసేది వీరే

Satyam NEWS

నాగార్జునతో వస్తున్న బిగ్ బాస్ నాలుగో సీజన్

Satyam NEWS

Breaking News: శ్రీలంకలో తలెత్తిన రాజకీయ సంక్షోభం

Satyam NEWS

Leave a Comment