ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుటుంబ సమేతంగా స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు. తన కుటుంబ సభ్యులతో కలిసి గురువారం అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్లో పూజలు చేశారు. ఈరోజు అల్లు అర్జున్ భార్య పుట్టినరోజు. అందుకే వాహెగురు ఆశీస్సులు పొందేందుకు కుటుంబంతో సహా వచ్చాడు. దర్బార్ సాహిబ్ వద్ద కుటుంబం మొత్తం సిక్కు సాంప్రదాయాల ప్రకారం ప్రార్ధనలు చేశారు.
ఇతర సందర్శకులకు ఇబ్బంది కలగకుండా స్వర్ణ దేవాలయంలో ఎలాంటి హడావుడి లేకుండా నిర్వాహకులు చూశారు. అయితే ఆయన చుట్టూ పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. ఆలయంలో అతనిని చూసిన ప్రేక్షకులు అవాక్కయ్యారు. నటుడితో సెల్ఫీలు దిగేందుకు, ఆయనతో గడిపేందుకు అభిమానులు ఎగబడ్డారు. అల్లు అర్జున్ తన రాబోయే చిత్రం ‘పుష్ప 2’ షూటింగ్ను త్వరలో ప్రారంభించబోతున్నాడు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం దాని సీక్వెల్ గురించి అందరిలో ఆసక్తిని కలిగించింది.