వివాదాస్పద పౌరసత్వ చట్టాన్ని ఎన్ఆర్సి, ఎన్ సిపిఐలను అమలు చేయరాదని కోరుతూ విశాఖపట్నంలోముస్లిం సంఘాలు చేపట్టిన నిరసన దీక్షలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశాన్ని మతపరంగా విభజించడమే ఎన్నార్సీ , సిఏఏలక్ష్యమని అన్నారు.
దేశ ప్రజల సమానత్వపు హక్కును కాల రాయడం రాజ్యాంగ విరుద్దమని వాసుపల్లి గణేష్ అన్నారు. దేశంలో హిందూ ముస్లింల మధ్య ఐక్యతను దెబ్బతీసే చట్టం మనకు వద్దు అని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నార్సీ , సిఏఏ లకు వ్యతిరేకంగా అసెంబ్లీ లో తీర్మానం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.