30.7 C
Hyderabad
April 29, 2024 06: 30 AM
Slider నల్గొండ

ధనుర్మాస సందర్భంగా శ్రీవేంకటేశ్వర స్వామికి అష్టోత్తర కమలాఫల పూజ

#MLASaidireddy

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని మఠంపల్లి బైపాస్ రోడ్డులోని శ్రీ పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి కోవెలలో శుక్రవారం రాత్రి ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా స్వామివారికి 108 కమలాలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు అర్చకులు వైభవోపేతంగా నిర్వహించారు.

అనంతరం సుమంగళి పూజ నిర్వహించి ‘శ్రీ తవ్వి నటరాజ్ డాన్స్ స్కూల్’ నృత్య గురువు తిరుపతి స్వామి ఆధ్వర్యంలో చిన్నారులతో నృత్య ప్రదర్శన నిర్వహించారు. ఈకార్యక్రమాన్ని ముఖ్యతిథిగా స్థానిక శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి హాజరై ప్రారంభించారు. అనంతరం చిన్నారులకు దేవాలయ చిత్రపట జ్ఞాపికలను అందించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అమృతారెడ్డి, కార్యవర్గ సభ్యులు తెలుకుంట్ల శ్రీను, రవీందర్ రెడ్డి, ప్రధాన అర్చకులు దామోదరా చార్యులు, విష్ణు,కౌన్సిలర్ అట్లూరి మంజుల హరిబాబు, డాక్టర్ గంపల శిరీష కరుణ్ కుమార్, నగేష్ రాథోడ్,చిన్నారుల తల్లిదండ్రులు,  మహిళా భక్తులు, సంగీత, నృత్య కళాభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

కరోనా నియంత్రణకు జువారి సిమెంట్స్ విరాళం

Satyam NEWS

హనుమంత వాహనంపై సీతారామలక్ష్మణులు….

Satyam NEWS

దయగల మానవుడి హృదయమే దేవుడి నిలయం

Satyam NEWS

Leave a Comment