29.7 C
Hyderabad
May 2, 2024 04: 18 AM
Slider కృష్ణ

కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో వైసీపీ కార్యకర్తల విధ్వంసం

#krishnalankapolicestation

విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో వైసీపీ పార్లమెంటు సభ్యుడు నందిగం సురేష్ అనుచరులు విధ్వంసం సృష్టించారు. అతి వేగంతో వస్తున్న కొందరు యువకులను కృష్ణలంక ఎస్ ఐ ఆపి ప్రశ్నించడంతో మొదలైన గొడవ చినికిచినికి గాలివానలా మారింది. బస్టాండ్ ఎదురుగా గంగోత్రి హోటల్ లో వద్ద ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న యువకులని ఆపి ఎస్ ఐ ప్రశ్నించారు.

తాము ఎంపీ నందిగామ సురేష్ అనుచరుల అంటూ వారు పోలీసులను దుర్భాషలాడారు. దాంతో యువకులను అదుపులోకి తీసుకుని పోలీస్టేషన్ కు తరలించారు. ఎస్ ఐ, పోలీసు సిబ్బంది తో వాగ్వాదం జరిగి, పోలీసులతో వారు బాహాబాహికి దిగారు. జరుగుతున్న తతంగాన్ని వీడియో తీస్తున్న కానిస్టేబుల్ శ్రీనివాస్ ని కొట్టి ఫోన్ లాక్కుని ఫర్నిచర్ ని ధ్వంసం చేశారు.

వాళ్లు వెళ్ళిపోతుండగా గేటు దగ్గరికి వెళ్లి మరోసారి ఫోన్ ఇమ్మని అడిగితే మరోసారి కింద పడేసి కొట్టారు. విషయం తెలుసుకుని మరి కొంత మంది అనుచరులతో అర్ధరాత్రి స్టేషన్ కు వచ్చిన ఎమ్ పీ నందిగామ సురేష్ తన మునుషులను విడిపించుకుని వెళ్లారు. పోలీస్ అధికారులు విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు. బైక్ పై రాష్  డ్రైవింగ్ వెళ్తున్న వారిలో ఎంపీ సమీప బంధువు ఉన్నారు.

Related posts

వరద సహాయక చర్యల్లో టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొనాలి

Satyam NEWS

కమిషన్ల కోసం కక్కుర్తి పడి ఏడుసార్లు విద్యుత్ ఛార్జిల పెంపు

Satyam NEWS

ఉప్పల్ లో ఘనంగా సదర్ మహోత్సవాలు

Satyam NEWS

Leave a Comment