సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని పట్టణంలోని ఎంపి క్యాంపు కార్యాలయంలో రాజీవ్ గాంధీ ఆటో యూనియన్ మట్టపల్లి అడ్డ వారి ఆధ్వర్యంలో ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐ ఎన్ టి యు సి ప్రధాన కార్యదర్శి,రైల్వే బోర్డు మెంబర్ యరగాని నాగన్న గౌడ్,పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున రావు,ఆటో యూనియన్ అధ్యక్షుడు ఎస్.కె హుస్సేన్,ఆర్గనైజింగ్ సెక్రెటరీ జలీల్ భాయ్,తన కార్యవర్గంతో పాటు మండల ఐ ఎన్ టి యు సి అధ్యక్షుడు మేళ్లచెరువు ముక్కంటి,పి.రామ్మూర్తి, సలిగంటి జానయ్య, తదితరులు పాల్గొన్నారు.