కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక నిర్ణయాలకు నిరసనగా ఈనెల 28, 29 తేదీలలో జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సహకరించాలని ఖమ్మం ట్రాఫిక్ ఏ సి పి రామోజీ రమేశ్ కు ఆటొ కార్మిక జె ఏ సి నేతలు నోటిస్ అందించారు. రోడ్ సేఫ్టీ బిల్లును రద్దు చేయాలని పెట్రోల్ డీజిల్ గ్యాస్ ను జిఎస్టి లోకి తీసుకురావాలని డిమాండ్ చేసారు. ఈనెల 28 న ఖమ్మం జిల్లా ఆటోల బంద్ కు ఆటో యూనియన్ JAC నాయకులు పిలుపునిచ్చిన విషయాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు పాల్వంచ కృష్ణ , MD పాష , జిల్లా ఉపేందర్ పేర బోయిన మోహన్ రావు, లక్ష్మీనారాయణ, SK సత్తార్, వేమ సెల్వరాజ్, ఆటో కార్మికులు పాల్గొన్నారు.
previous post
next post