దేశ వ్యాప్తంగా 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు మరికొద్ది గంటలలో ప్రారంభం కానున్నాయి. ఢిల్లీలో ఎర్రకోట వద్ద ప్రధాని మోడీ మువ్వన్నెల పతాకం ఎగురవేస్తే…రాష్ట్రాలలో సీఎం లు.. ఆయా జిల్లాలో ఇంచార్జ్ మంత్రులు సరిగ్గా ఉదయం తొమ్మిది గంటలకు జాతీయ పతాకం ఎగురవేయనున్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసారు…. రెవెన్యూ, పోలీసు శాఖలు. అయితే ప్రతీ ఏటా మాదిరిగాన ఈ ఏడాది కూడా… పలు ప్రభుత్వ శాఖలలో ఉత్తీర్ణత, ప్రతిభ కనబరచిన ఉద్యోగస్తులకు…ప్రభుత్వం… సత్కారాలు, సన్మానాలు, అవార్డులు అందించనుంది. అందులో భాగంగా విజయనగరం జిల్లా కు సంబంధించి పరేడ్ గ్రౌండ్ లో డిప్యూటీ సీఎం, జిల్లా ఇంచార్జ్ మంత్రి బూడి ముత్యాల నాయుడు జాతీయ జెండా ఎగుర వేస్తారు. అలాగే.. మొత్తం 85 శాఖల నుంచే 350 మందికి పైగా రెవెన్యూ, పోలీసు ఉద్యోగులకు అవార్డులు ఇవ్వనున్నారు… డిప్యూటీ సీఎం. ప్రధానంగా విజయనగరం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో డీ సెక్షన్ సూపరింటెండెంట్.. జీ.రాము తొలి అవార్డు ను అందుకోనున్నారు.
previous post
next post