ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ ఏఎస్ రావు నగర్ డివిజన్లోని కమలానగర్ అయ్యప్ప స్వామి ఆలయంలో మంగళవారం నుండి అయ్యప్ప స్వామి మండల పూజ ప్రారంభం కానున్న నేపథ్యంలో రామకోటేశ్వరరావు గురు స్వామి , వారి శిష్య బృందం ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ చేశారు. ఆలయానికి వచ్చే భక్తులకు శ్రావణమాసం సందర్భంగా నెలరోజుల పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్టు రామకోటేశ్వరరావు గురు స్వామి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ కమిటీ వారు చేసే నిత్యాన్నదానానికి నిరుపేదలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అయ్యప్ప స్వామి తీర్థ, అన్న ప్రసాదములు స్వీకరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్ వి రావు స్వామి, మురళి స్వామి, వినయ స్వామి, పవన్ కుమార్ స్వామి తదితరులు పాల్గొన్నారు. జి. శ్రీనివాసరావు, సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా
previous post