సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం చేపట్టిన బడిబాట కార్యక్రమంలో ఎంపిపి గూడెపు శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు.
అనంతరం గూడెపు శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్ కార్యాచరణకై అన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ టీచర్ల నియామకాలు,ఉచిత విద్యాబోధన,యూనిఫామ్,పుస్తకాలు పంపిణీ,మధ్యాహ్నం నాణ్యమైన భోజన సదుపాయం అందిస్తుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులను చేర్పించాలని అన్నారు .
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉదయశ్రీ, ఉపాధ్యాయులు శ్రీనివాస్,శ్రీనివాసరెడ్డి, మాతంగి ప్రభాకర్ రావు,ఉపేందర్,శేషగిరి, సుజాత,అన్వేష్,వసంతరావు,జనార్దన్ రెడ్డి, రవీందర్ రెడ్డి,విద్యార్ధిని,విద్యార్థులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ హుజూర్ నగర్