29.7 C
Hyderabad
May 2, 2024 06: 43 AM
Slider విజయనగరం

కౌలు రైతులను ఆదుకునే ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్

#janasena

పల్లె పల్లెకు జనసేన పార్టీ కార్యక్రమంలో భాగంగా రెండో రోజు విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం, ఎం. వెంకటాపురం లో పార్టీ సీనియర్ నేత మర్రాపు సురేష్ ఇంటిఇంటికి పర్యటించారు. ప్రతీఇంటికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రజలకు సహాయం చేస్తున్న, చేయబోయే కార్యక్రమాల వివరాలతో ఉన్న కరపత్రాలను ప్రజలకు వివరిస్తూ పంచిపెట్టారు.

ఈ సందర్భంగా నాయకులు మర్రాపు సురేష్ మాట్లాడుతూ అధికారం లేకపోయినా రాష్ట్రంలో కౌలు రైతులను ఆదుకునే ఏకైక నేత పవన్ కళ్యాణ్ అని,యువతకోసం, మహిళల  కోసం, రైతుల కోసమే కాకుండా రాష్ట్రం సంక్షేమం కోసం తన బంగారం లాంటి జీవితాన్ని వదులుకొని, కేవలం ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయడానికి ముందుకొచ్చిన మహనేత పవన్ కళ్యాణ్ అని కొనియాడారు.

ఇటువంటి నిస్వార్థనాయకునికి ప్రజల ఆశీస్సులు ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నేతలు ఆదాడ మోహనరావు, మిడతాన రవికుమార్,సురేష్,జనసేన ఝాన్సీ వీర మహిళ లావణ్య, సంతోష్, పండు, కడమల శ్రీను, హరీష్ నాని,చలం, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

డిసెంబర్ 5,6,7తేదీలలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు

Murali Krishna

వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్న వరంగల్ పోలీసులు

Satyam NEWS

మహిళా భద్రతకు మరిన్ని చర్యలు : డిఐజి రంగనాధ్

Satyam NEWS

Leave a Comment