ప్రజా సంగ్రామ యాత్ర 400 కిలోమీటర్ల మైలు రాయి దాటిన సందర్బంగా బిజెపి రాష్ట్ర నేత ,మాజీ సింగిల్విండో చైర్మన్ కొలను శంకర్రెడ్డి ఆధ్వర్యంలో బీజెపి రాష్ట్ర అధ్యక్షులు, ఎంపి బండి సంజయ్కుమార్ ను సిరిసిల్ల జిల్లాలోని ఇల్లందుల కుంట మండలంలో కలిసి సుప్రసిద్ద బాలాపూర్ గణనాధుడి లడ్డూ ప్రసాదమును అందజేశారు.
ఈ సందర్బంగా కొలను శంకర్రెడ్డి మాట్లాడుతూ విఘ్నూలు తొలగి విజయాలు కలగాలని , వినాయకుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని అన్నారు. కార్యక్రమంలో బీజేపి నేతలు ముత్యాల తిరపతిరెడ్డి, రామిడి మహేందర్రెడ్డి, గడ్డం నాగరాజు, గుర్రాల సంతోష్రెడ్డి, అభిలాష్, భరత్,వరణ్, నందు తదితరులు పాల్గొన్నారు.