బందరు పోర్టు నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డిపిఆర్) రూప కల్పనకు బీజం పడింది. రూ.5 వేల కోట్లలోపు వ్యయంతో నిర్వహించడానికి వీలుగా డీపిఆర్ను రూపొందించే బాధ్యతను జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ మీద మచిలీపట్నం ఏంపీ వల్లభనేని బాలశౌరి మోపారు. పోర్టుకు భూ అవసరాలు, డ్రెడ్జింగ్ ప్రక్రియ, ఇతర అవసరాలు కలిపి ప్రిలిమనరీ డీవీఆర్ను రూపొందించిన తర్వాత ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకు వెళతారు. ఆయన చేసే మార్పులు సూచనలతో బందరు పోర్టు నిర్మాణం పట్టాలెక్కించాలని నిర్ణయించారు. బందరు పోర్టుతో పాటు గిలకిలదిండిలో ఫిషింగ్ హార్బర్ కు కూడా తగిన ప్రణాళికలు రూపొందించాలని, రక్షిత మంచి నీటి పథకాన్ని రూ. 4 వేల కోట్లతో అమలు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మదింపు జరిగింది.