టీ బీజేపీ మాజీ చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కు ప్రమోషన్ లభించింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎంపీ బండి సంజయ్ నియామకమయ్యారు. అలాగే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణకు రెండవ సారి అవకాశం కల్పించారు. ఏపీ బీజేపీ నేత సత్యకుమార్ రెండవసారి బీజేపీ జాతీయ కార్యదర్శగా ఎంపికయ్యారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాల మేరకు అరుణ్ సింగ్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, తెలంగాణ బీజేపీని స్ట్రాంగ్ చేసిన బండి సంజయ్ను అనూహ్యంగా స్టేట్ చీఫ్ పదవి నుండి తొలగిస్తూ బీజేపీ హైకమాండ్ సంచలన నిర్ణయం తీసుకుంది. బీజేపీ జాతీయ నాయక్వతం తీసుకున్న ఈ నిర్ణయంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో అలర్ట్ అయిన బీజేపీ హైకమాండ్ బండి సంజయ్కు పార్టీలో ప్రాధాన్యం కల్పించింది.