మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణం పట్ల సంతాప సూచకంగా వాయిదా వేసిన ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్మల్ లయన్స్ క్లబ్ నేడు నిర్వహించింది.
ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ నిర్మల్ కొందరు ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించింది. సత్కారం పొందిన ఉపాధ్యాయులలో B.శోభ (teacher bio Science ) ZPSS Kadthal, P.విజయ లక్ష్మి (teacher Social )Girls High School Somwarpet Nirmal, కుమ్మరి బోజన్న (వ్యాయమ ఉపాద్యాయుడు) ZPSS VENGWAPET, V.మురళీధర్ (retd హెడ్ మాస్టర్ ) ZPSS velmal bopparam, అన్నం శ్రీదేవి (teacher) MPPS khanapur ఉన్నారు.
ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ నిర్మల్ అధ్యక్షులు మంత్రి శ్రీనివాస్ గుప్తా, కార్యదర్శి చంద్ర మోహన్ రెడ్డి, ప్రోగ్రాం చైర్మన్ A. వెంకటేశ్వర రావ్, జోన్ చైర్మన్ K. గంగా రెడ్డి, డిస్ట్రిక్ చైర్మన్ P. గంగా రెడ్డి, నేరెళ్ల హన్మంతు తదితరులు ప్రసంగించారు.
విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చి దిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర గురించి వారు మాట్లాడారు. ఉపాధ్యాయులకు ఉండాల్సిన సేవా నిరతిని వివరించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ సభ్యులు వట్టిమల్ల నర్సయ్య, కృష్ణం రాజేష్, L. రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారని నిర్మల్ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ మంత్రి శ్రీనివాస్ గుప్తా తెలిపారు.