38.2 C
Hyderabad
April 29, 2024 20: 57 PM
Slider ప్రత్యేకం

బండి సంజయ్ పాదయాత్ర తో ప్రజల్లో వెలిగిన చైతన్య జ్యోతి

#bandisainjai

కేంద్ర మంత్రి పురుషోత్తం… తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న పాదయాత్ర ను చూసి ప్రశంసలు కురిపించారు.

1998లో తాను కూడా గుజరాత్ లోని తన అసెంబ్లీ నియోజకవర్గంలో పాదయాత్ర చేశానని కేంద్ర మంత్రి పురుషోత్తం అన్నారు. పాదయాత్ర చేస్తే ఎలా ఉంటుందో తనకు తెలుసు… ఆ అనుభవం తనకు ఉందన్నారు.

పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ కు ప్రత్యేక అభినందనలని కేంద్ర మంత్రి పురుషోత్తం అన్నారు. బండి సంజయ్ కలను నెరవేర్చేందుకు ఆయనతో పాటు రాత్రి, పగలు నడుస్తున్న కార్యకర్తలను అభినందిస్తున్నారన్నారు.

29 రోజులుగా రాష్ట్రంలో బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారు. పాదయాత్రలో బండి సంజయ్ వెంట నడుస్తున్న కార్యకర్తలంతా…. బండి సంజయ్ పడుకున్న తర్వాతే పడుకుంటున్నారని కేంద్ర మంత్రి పురుషోత్తం అన్నారు. ఆయనకంటే ముందే నిద్ర లేస్తున్నారన్నారు.

దేశమంతా ప్రధాని మోడీ ని ఏ విధంగా ప్రేమిస్తూ.. ఆశీర్వదిస్తున్నారో… అలానే సంజయ్ నేతృత్వంలో తెలంగాణ ప్రజల అండ, ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాన్నారు. ప్రజల సమస్యలు, కష్టాలు తెలుసుకునేందుకు ఎండ. వానలను లెక్కచేయకుండా బండి సంజయ్  పాదయాత్ర చేస్తున్నారన్నారు.

నిజంగా తనకు బండి సంజయ్ ను చూస్తే చాలా ఆనందం వేస్తోందని కేంద్ర మంత్రి అన్నారు. ప్రధాని మోడీ నేతృత్వంలో దేశంలో 50 కోట్ల మందికి కరోనా వాక్సిన్ ఇచ్చామన్నారు.

ఈ దెబ్బకు మోడీ ని విమర్శించిన వాళ్ళ అందరి నోళ్లు మూసుకుపోయాయని కేంద్ర మంత్రి విమర్శించారు. ఒక్క రోజులో 2 కోట్లకు పైగా మందికి వాక్సిన్ వేసిన ఘనత సొంతం చేసుకున్నామన్నారు. పాదయాత్ర ద్వారా ప్రజల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు బండి సంజయ్ కి సంపూర్ణ మద్దతిస్తారని నమ్ముతున్నానని కేంద్ర మంత్రి అన్నారు.

Related posts

హై కోర్ట్ కాలనీ టు హెచ్ఎంటి నగర్ లింక్ రోడ్డును పునః ప్రారంభించాలని కేటీఆర్ కి వినతి

Satyam NEWS

విక్రమ సింహపురి యూనివర్సిటీలో గాంధీ వర్ధంతి

Satyam NEWS

ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు

Satyam NEWS

Leave a Comment