హైదరాబాద్ నగరంలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతున్నది. నగరంలోని కోఠిలోని ఒక బ్యాంక్ మేనేజర్ కరోనా సోకి మరణించినట్లు వెల్లడి కావడంతో మొత్తం ఆ బ్యాంక్ బ్రాంచ్ ఆఫీసునే మూసివేశారు. బ్యాంకు సిబ్బందితో పాటు బ్యాంకుకు వచ్చిన ఖాతాదారులను కూడా క్వారంటైన్ కు తరలించారు.
గత కొద్ది రోజులుగా బ్యాంకు మేనేజర్ను ఎవరెవరు కలిశారనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఆయనతో కాంటాక్ట్ అయిన వారందరినీ ఐసోలేషన్కు తరలించారు.