నిర్మల్ జిల్లా బాసర లోని శ్రీ సరస్వతి అమ్మవారి సన్నిధిలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.
నేడు అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం కావడంతో శ్రీ సరస్వతి అమ్మవారు ‘స్కంద మాత” అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు.
శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా నేడు ఐదవ రోజు పంచమి మూల నక్షత్రము సందర్భం గా ‘స్కంద మాత” అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్న సరస్వతి అమ్మవారిని కోవిడ్ నిబంధనలు అనుసరించి భక్తులు దర్శనం చేసుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున మూలా నక్షత్రం సందర్భం గా మంత్రి అల్లోల ఇంద్రకరన్ రెడ్డి దంపతులు అమ్మవారి కి పట్టు వస్త్రాల ను సమర్పించారు.