గాంధీభవన్లో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో మహిళలు వచ్చి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ములుగు ఎమ్మెల్యే సీతక్క ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు, మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ వరలక్ష్మిలతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు సునీత రెడ్డి, కాంగ్రెస్ కంటెస్టెడ్ కార్పొరేటర్, మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు శంభుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్, కార్యదర్శి లావణ్య, పద్మ, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట