ముఖ్యమంత్రి కేసీఆర్ దసరా సందర్భంగా రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ బతుకమ్మ పండుగ కానుకగా చీరలు పంపిణీ కార్యక్రమం వనపర్తి జిల్లా కేంద్రంలోని వల్లబ్ నగర్ 33 వ వార్డులో కౌన్సిలర్ అలేఖ్య తిరుమల్ చేతుల మీదుగా వార్డు మహిళలకు చీరల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహిళలు సంతోషంతో కెసిఆర్ మమ్మల్ని ఇంటి ఆడపడుచు లాగా భావించి దసరా కానుకగా చీరలు ఇవ్వడం మాకు చాలా సంతోషకరం కెసిఆర్ ప్రభుత్వం కలకాలం వర్ధిల్లాలని ఆశీర్వదిస్తూ చీరలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ తిరుమల్, మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ శ్రీనాథ్, ఆర్. పి. లక్ష్మి, వార్డు మహిళలు పాల్గొన్నారు.
పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్