నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఎక్సైజ్ కార్యాలయంలో సార, బెల్లం తరలింపులో పట్టుబడిన వాహనాలను వేలం వేస్తున్నట్టు కొల్లాపూర్ ఎక్సైజ్ సిఐ ఏడుకొండలు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
సెప్టెంబర్ 1వ తేదీన బుధవారం కొల్లాపూర్ ఎక్సైజ్ కార్యాలయంలో వేలం పాట ఉన్నట్లు తెలిపారు.సరాయి, బెల్లం విక్రయాల, తరలింపులో పట్టుబడి సీజ్ చేసిన ద్విచక్ర, త్రి చక్ర వాహనాలు వేలంలో ఉన్నట్లు తెలిపారు.
ఆసక్తి ఉన్నవారు ఉదయం 10 గంటలకు కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు.