ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్నతీవ్ర వాయుగుండం క్రమేణా బలపడుతోందని దీని ప్రభావంతో రాగల 12 గంటల్లో తుపానుగా బలపడనుందని రేపు రాత్రి శ్రీలంక దగ్గర తీరం దాటే అవకాశం ఉందని, రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల శాఖ కమిషనర్ కన్నబాబు సూచించారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో పరిసర ప్రాంతాల్లో సముద్రం అలజడిగా ఉంటుందని ఎల్లుండి వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ సూచించారు.