రాష్ట్రంలో బీసీ నాయకులను రాజకీయంగా ఎదుర్కోలేక ఆదిరెడ్డి శ్రీనివాసులు,ఆదిరెడ్డి అప్పారావుల మీద అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయడం నీతిమాలిన చర్యని టిడిపి బీసీ సెల్ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి బారతాల శ్రీధర్ యాదవ్ బాబు,రాష్ర్ట బిసి సెల్ ఉపాధ్యక్షులు తాటిసుబ్బరాయుడు ఖండించారు.నందలూరు లో ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో పెచ్చు మీరుతున్న వైకాపా అరాచకాలను కప్పిపుచ్చు కోవడానికి అమాయకులైన బిసి నేతలు, నాయకులపై అక్రమ కేసులను బనాయించి వారి మీద కక్ష్య సాధింపు చేయడం ప్రస్తుత సైకో ప్రభుత్వానికి సిగ్గుమాలిన చర్య అని,వైకాపా అరాచక ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడినప్పటికీ ఈ ప్రభుత్వానికి సిగ్గు రావడంలేదని వారు తీవ్రంగా హెచ్చరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న అప్రజాస్వామిక చర్యలను కప్పిపుచ్చు కోవడానికి ఇటువంటి చర్యలు పాల్పడుతున్నారని, వీటన్నింటికీ భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీలో అధికారంలోకి రావడం తధ్యమని,చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు
previous post