38.2 C
Hyderabad
April 29, 2024 12: 47 PM
Slider చిత్తూరు

తిరుపతిలో రౌడీ షీటర్ పై పగ తీర్చుకున్నారు

belt murali

రౌడీ షీటర్ బెల్ట్ మురళిని గత నెల 21వ తేదీ తిరుపతి లో కొందరు బహిరంగంగా నరికి చంపారు. ఆ కేసును పోలీసులు ఛేదించారు. సంచలనం రేపిన బెల్ట్ మురళి  హత్య కేసును పోలీసులు ఇంత త్వరగా ఛేదించడంపై ఎస్పి గజ రావ్ భూపాల్ పోలీసులను అభినందించారు.

ఇంతకీ బెల్ట్ మురళిని ఎవరు చంపారనే దానికి సమాధానంగా తిరుపతి, రేణిగుంట కు చెందిన 17 మంది ముద్దాయి లను అరెస్టు చేసిన పోలీసులు మీడియా ముందు ప్రవేశ పెట్టారు. వారు హత్యకు ఉపయోగించిన ఆటో, స్కూటీ మారణాయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

2017 లో మురళి, ప్రమోద్ కొంత మంది స్నేహితులు కలిసి సాకే భార్గవ్ అనే వ్యక్తిని హత్య చేసారు. తిరుపతి పరకాల వీధి లో 2017 లో జరిగిన భార్గవ్ హత్యకు ప్రతీకారంగానే పసుపులేటి మురళి ని హత్య చేసినట్టు పోలీసులు ముందు నిందితులు ఒప్పుకున్నారు.

Related posts

నిరుపేదల ఆకలి విలువను తెలిపేవి రంజాన్ ఉపవాసాలు

Satyam NEWS

హుజురాబాద్ ఉప ఎన్నికలో ఏరులై పారుతున్న మద్యం, డబ్బు

Satyam NEWS

వ్యవసాయ మోటార్లకు మీటర్ల బిగింపుపై చట్ట సవరణ వద్దు

Satyam NEWS

Leave a Comment