అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన ముగ్గురు డిగ్రీ విద్యార్థినులు నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశారు. పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినులు వారి అవసరాల నిమిత్తం నగరానికి చెందిన మహేశ్ అనే వడ్డీ వ్యాపారి వద్ద రూ.20 వేలు అప్పు తీసుకున్నారు. వడ్డీ వ్యాపారి నుంచి వత్తిళ్లు అధికమవడంతో బుధవారం రాత్రి ముగ్గురు విద్యార్థినులు తమ ఇళ్ల నుంచి అనంతపురం ఆర్టీసీ బస్టాండ్కు చేరుకుని నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశారు. చికిత్స కోసం వారిని అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న సీఐ బాషా ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
previous post
next post