38.2 C
Hyderabad
April 29, 2024 11: 55 AM
Slider నల్గొండ

అడ్డగోలుగా విద్యుత్ చార్జీల వసూలు అన్యాయం

#Congress protest Dharna

పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం పరిధిలోని మేళ్లచెరువు మండల కేంద్రంలో  కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి ప్రదర్శనగా ఎమ్మార్వో ఆఫీస్ వద్దకు  చేరుకొని మెమోరాండం సమర్పించారు.

ఈ సందర్భంగా జెడ్ పి టి సి చాగమ రెడ్డి, పద్మా గోవింద్ రెడ్డి  మాట్లాడుతూ లాక్ డౌన్ విధించిన కాలంలో విద్యుత్ రీడింగ్ తీయకుండా ఒకేసారి రీడింగు తీయడంతో స్లాబ్ ప్రకారం ఎక్కువ మొత్తంలో విద్యుత్తు చార్జీలు వసూలు చేస్తున్నారని, దీనితో ఒక యూనిట్ తో ధర  పెరిగిపోవడంతో పెద్ద మొత్తంలో వినియోగదారులు నష్టపోతున్నారని అన్నారు.

బిపిఎల్ కుటుంబాలకు చిన్న వ్యాపారస్తులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రభుత్వం ప్రజా వ్యతిరేక బిల్లులను వసూలు చేస్తుందని, వెంటనే తగ్గించాలని, ఆదుకోవాల్సిన ప్రభుత్వమే అడ్డగోలుగా ప్రజలపై విద్యుత్ చార్జీల భారాన్ని పోతుందని అన్నారు. అనంతరం మండల తాసిల్దార్ దామోదర్ రావుకు మెమోరాండం అందజేశారు.

ఈ కార్యక్రమంలో  చాగంటి గోవింద్ రెడ్డి, కాకునూరి భాస్కర్ రెడ్డి,శెట్టి రామచంద్ర రావు,ఇరిగల రామకృష్ణారెడ్డి, చిన్న పొంగు సహదేవ, బుచ్చయ్య, వెంకట్ రామ్ రెడ్డి, సోమి రెడ్డి ,వెంకట్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

Related posts

‘ఊర్వశి ఓటిటి’కి గర్వకారణం సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి అంకితం!!

Satyam NEWS

సెన్సార్ కార్యక్రమాల్లో 1948 – అఖండ భారత్ (the murder of mahathma)

Satyam NEWS

ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి

Sub Editor 2

Leave a Comment