భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో ఆర్జిత సేవలు పునఃప్రారంభమయ్యాయి. కరోనా నేపథ్యంలో ఇన్నాళ్లు స్వామివారి పూజలకు భక్తులను అధికారులు అనుమతించలేదు.
భద్రాద్రి రామయ్య సన్నిధిలో జరిగే పూజల్లో భక్తులు నేరుగా పాల్గొనేందుకు అనుమతిస్తున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ఆర్జిత సేవలు కొనసాగిస్తామని ఆలయ ఈవో శివాజీ తెలిపారు.
భక్తుల సంఖ్యకు అనుగుణంగా అన్ని రకాల ప్రసాదాలు అందుబాటులో ఉంచుతున్నామని ఈవో చెప్పారు.