భారత స్వాతంత్య్ర ఉద్యమంలో విప్లవ అమరుల త్యాగాలు వెలకట్టలేనివి అని సిపిఐ జిల్లా కార్యవర్గసభ్యులు పాలకూరి బాబు, యల్లావుల రాములు అన్నారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో మంగళవారం సిపిఐ కార్యాలయంలో ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ సిపిఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా అమరుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలర్పించిన మహనీయులను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఆనాడు వనరులపై పరాయి పెత్తనాన్ని తొలగించాలని అనేకమంది ప్రాణాలు విడిచారు అన్నారు.ఈనాడు వనరులపై ప్రైవేటు పెత్తనాన్ని వ్యతిరేకిస్తూ యువకులు పెద్దయెత్తున ఉద్యమించాలని అన్నారు. ఎర్ర జెండాల స్ఫూర్తితో సమానత్వం కోసం కృషి చేయాలని అన్నారు.పేదల అభ్యున్నతి కోసం కృషి చేసేది వామపక్షాలేనని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు, సిపిఐ జిల్లా కార్యవర్గసభ్యులు యల్లావుల రమేష్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు జడ శ్రీనివాస్,నాయకులు అబ్బురబోయిన లింగయ్య,జక్కుల శ్రీనివాస్,గుండెబోయిన వెంకన్న,కుడి తొట్టి స్వామి, బంటూ శ్రీను,జక్కుల వెంకటేశ్వర్లు,రాములు తదితరులు పాల్గొన్నారు.