పదవి విరమణ చేసిన భైంసా టౌన్ ఎఎస్ఐ ఎస్.సాయన్నకు నిర్మల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. నిర్మల్ జిల్లా ఎస్పీ సి.శశిధర్ రాజు ఆయనను పూల మాల వేసి శాలువతో ఘనంగా సన్మానించారు.
విధి నిర్వహణలో సాయన్న అందరి మన్ననలను పొందాడని ఈ సందర్భంగా ఎస్పీ అన్నారు. పోలీస్ ఉద్యోగ నిర్వహణలో అంకిత భావంతో పనిచేసిన వ్యక్తి సాయన్న అని ఆయన అన్నారు. విధి నిర్వహణలో పగలనక, రాత్రనక, పండగల సమయంలో భార్యా, పిల్లలకు దూరంగా ఉండి డ్యూటీలు చేసారు.
పదవి విరమణ చేసిన మీరు ఇకపై కుటుంబ సభ్యులతో అనందంగా ఉండండి అని అన్నారు. 39 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసి పదవీ విరమణ చేసినందుకు ఎస్పీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. సాయన్నకు రిటైర్డ్ మెంట్ బెనిఫిట్ పత్రాలు అందచేశారు.