బాలకృష్ణ కెరీర్లో ఓ మైలురాయిగా నిలిచిన సినిమాల్లో ‘భైరవద్వీపం’ ఒకటి. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన చిత్రంలో రోజా హీరోయిన్గా నటించగా స్పెషల్ సాంగ్లో రంభ అలరించింది. ఇక 1994 ఏప్రిల్ 14న విడుదలైన ఈ సినిమా అద్భతమైన గ్రాఫిక్స్తోపాటు పాటలతోనూ ప్రేక్షకులను మైమరపించి 9 నంది అవార్డులను సొంతం చేసుకుంది.
అయితే ఈ మూవీని 4కె అల్ట్రా హెచ్డీ టెక్నాలజీతో ఆగస్ట్ 5న రీ రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర నిర్మాతలు ప్రకటించారు. అప్పట్లో అంతగా టెక్నాలజీ లేకపోయినా ప్రతి సీన్ అమేజింగ్ అనేలా చిత్రీకరించగా.. ఇప్పుడు 4Kలో రీ క్రియేట్ చేస్తున్నారంటే ఓ రేంజ్లో ఉంటుందంటున్నారు ఫ్యాన్స్.