ఆంధ్రప్రదేశ్ లో దేవాలయాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ భజరంగ్ దళ్ కార్యకర్తలు హైదరాబాద్ లోని వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంటిని ముట్టడించారు.
హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు. లోటస్ పాండ్లోని ఏపీ సీఎం జగన్ ఇంటిని భజరంగ్దళ్ కార్యకర్తలు ముట్టించడంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది.
ఈ క్రమంలో పోలీసులకు భజరంగ్దళ్ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. మంత్రి కొడాలి నానికి వ్యతిరేకంగా భజరంగ్ దళ్ కార్యకర్తలు నినాదాలు చేశారు.
వెంటనే అప్రమత్తమైన పోలీసులు భజరంగ్దళ్ కార్యకర్తలను అరెస్టు చేసి గోషామహాల్ పోలీస్స్టేషన్కు తరలించారు.